
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో ఉస్మానియ యూనివర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద బాణసంచా కాల్చి స్వీట్స్ తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థి సంఘం (అంస) నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మాల సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో చోటు కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి అంసా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంస అధ్యక్షులు నామ సైదులు మీడియాతో మాట్లాడారు. చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకట స్వామికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా మాలలకు సముచితమైన స్థానం కల్పించాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ అధిష్టానం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున కర్గేలకు కృతజ్ఞతలు తెలిపారు.