. < 1 minute

మంత్రిగా వివేక్ వెంకటస్వామి ప్రమాణ స్వీకారం.. తిరుమలలో మొక్కులు చెల్లించుకున్న అభిమానులు

Caption of Image.

తిరుపతి: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు తిరుమల అలిపిరి పాదాల మంటపం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో ఆయన అభిమానులు తిరుమల వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. 101 కొబ్బరికాయలు కొట్టి దళిత సంఘాల నేతలు, అభిమానులు పూజలు చేశారు.

అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి అభిమానులు స్వీట్స్ పంచుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వివేక్ వెంకటస్వామి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాల‌ని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. నిరంతరం పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి వివేక్ వెంకట స్వామి కృషి చేశారని తెలిపారు. దళిత సంఘాల నేతలు మల్లారపు మధు, నాగేంద్ర, బాబురావు, శ్రీనివాసరావు, బాలకృష్ణ, హరిబాబు తదితరులు తిరుమలలో మొక్కులు చెల్లించుకున్నారు.

►ALSO READ | దత్తన్న ప్రజల మనిషి.. రాజకీయాల్లో వాజ్పేయికి ఉన్నంత గౌరవం ఉంది: సీఎం రేవంత్

ఇదిలా ఉండగా.. వివేక్ వెంకటస్వామికి మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించినందుకు మాల విద్యార్థి సంఘాల నాయకులు స్వాగతించారు. ఈ మేరకు మాల విద్యార్థి నాయకుడు నామ సైదులు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామికి మంత్రి వర్గంలో చోటు కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాలలకు రానున్న రోజుల్లో కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని వారు కోరారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.