
ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతుంది. గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ వార్, అమెరికాలో మాంద్యం భయాలు, లాభాల క్షీణత, ఏఐ వినియోగంతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి టెక్ కంపెనీలు. కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 150కి పైగా అమెరికన్ కంపెనీలు జూన్లో లేఆఫ్లు ప్రకటించాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటు వేశాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా అనేక సంస్థల్లో భారీగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నారు.
రెండేళ్లుగా.. వరుస లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి టెక్ కంపెనీలు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా.. వందలాది కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. జూన్లో వారం రోజుల్లో 300మందికి మైక్రోసాఫ్ట్ లే ఆఫ్ ప్రకటించింది. మేలో 6000మందిని మైక్రోసాఫ్ట్ తొలగించింది. 2023లో 10వేల మందిని ఉద్వాసన పలికింది మైక్రోసాఫ్ట్. 2024లో 10శాతం ఉద్యోగులకు గూగుల్ కోత పెట్టింది. 2023లో 12వేల మందిని తొలగించింది గూగుల్ సంస్థ.
ఓవరాల్గా చూస్తే.. 2023లో 11వందల 93 కంపెనీలు 2లక్షల 64వేల 220 మంది తొలగించాయి. 2024లో 549 కంపెనీలు లక్షా 52వేల 472 మందిని ఇంటికి పంపాయి. 2025లో ఇప్పటివరకు 100కు పైగా టెక్ కంపెనీలు 27వేల 762మందికి ఉద్వాసన పలికాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.