
ఎంకి పెళ్లి సుబ్చిచావుకొచ్చిందంటారు .. ఇప్పుడు ఇదే సామెత అన్నమయ్య జిల్లా రామసమద్రం మండలంలోని రెండు గ్రామాల పెద్దమనుషులకు వర్తించేలా ఉంది. ఓ మహిళ వివాహేతర సంబంధం విషయం బట్టబయలు కావడంతో .. ఎర్రబోయినపల్లి… శ్రీరాములపల్లి గ్రామాల వారు రెండు గ్రామాలకు చెందిన పెద్దమనుషుల దగ్గర పంచాయితీ పెట్టారు. అయితే ఈ పంచాయితీకి రాజకీయ రంగు అంటుకోవడంతో పెద్దమనుషులపై దాడి జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
అన్నమయ్య జిల్లా.. రామసముద్రం మండలంలో రెండు గ్రామాల మధ్య శనివారం ( జూన్ 7) రాత్రి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఓ మహిళకు సంబందించి వివాహేతర సంబంధం విషయంలో జరిగిన పంచాయతీలో తలదూర్చిన పెద్దమనిషి ఎర్రబోయినపల్లికి చెందిన గంగప్ప, శ్రీరాములపల్లికి చెందిన వెంకటప్పల వర్గాల వారు …. రెండు గ్రామాలకు చెందిన వారు గొడవపడుతున్నారు.
ఈ విషయం పెద్ద మనుషుల దగ్గర రాజీకుదరకపోవడంతో పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదువారు ఫిర్యాదు చేశారు. ఎస్సై రవికుమార్ రెండు వర్గాలను పోలీస్ స్టేషనకు పిలపించి రాజీ కుదుర్చి గొడవ పడకూడదని సర్థిచెప్పి స్టేట్మెంట్ తీసుకుని పంపేసాడు. ఈ సమయంలో ఎర్రబోయినపల్లికి వెళుతున్న గంగప్ప వర్గీయులపై…. శ్రీరాములపల్లెలో వెంకటప్ప వర్గీయులు కొట్టి ఘర్షణకు దిగారు. గొడవ తారస్థాయికి చేరి ఇరువర్గాలు కర్రలు, కొడవళ్ళతో పరస్పర దాడులు చేసుకున్నారు.
ఈ ఘర్షణలో కమ్మవారిపల్లి పంచాయతీ ఎర్రబోయినపల్లికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ కె.చిన్నవెంకటప్ప (67), కె.వెంకటరమణ(45), యశ్వంత్(25), సుధాకర్35, గంగాధర్40, కె.గంగాధర్ (30), విశ్వనాధ్లు గాయపడగా ప్రత్యర్థి వర్గానికి చెందిన ఆర్.నడింపల్లి పంచాయతీ, శ్రీరాములపల్లెకు చెందిన వైసీపీ నేత వెంకటప్పతో పాటు అతని అనుచరులు మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను మదనపల్లె… పుంగునూర్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి విషమించిన చిన్న వెంకటప్ప, వెంకటరమణ, యశ్వంత్లను బెంగళూరుకి తరలించారు.
రెండు గ్రామాలకు చెందిన వైసీపీ వర్సెస్ టీడీపీ వర్గాల మధ్య పరస్పర దాడులు చేసుకుని కొట్టు కోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామసముద్రం ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో వెంటనే మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఘటన గల కారణాలను ఆసుపత్రిలో ఉన్న బాధితులను అడిగి తెలుసుకొని విచారణ చేపట్టారు.