. < 1 minute

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లో ఎన్‌డిఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం అన్నారు. ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మదురై ‘పరివర్తన’ నగరంగా కీర్తించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, ఎఐఎడిఎంకె కలసి ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమిళనాడులోనే కాదు పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఏప్రిల్‌లో తాను తమిళనాడు సందర్శిస్తానని, ఎఐఎడిఎంకెతో

సంబంధాలు పునరుద్ధరిస్తానని అన్నారు. ఇదిలావుండగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నాయినార్ నాగేంద్రన్ డిఎంకె ప్రభుత్వాన్ని తన ప్రసంగంలో విమర్శించారు. పశ్చిమ కొంగు ప్రాంతంలో పోలీసులు వయో వృద్ధులపై లక్షిత దాడులు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. తమిళనాడులో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందన్నారు. తాను వీలయినంత గరిష్ఠంగా అసెంబ్లీకి ఎంఎల్‌ఏలను తీసుకెళతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇదిలావుండగా పార్టీ కార్యకర్తలు సంకల్పంతో పనిచేయాలని, డిఎంకెను అధికారం నుంచి దించేసే లక్షంతో పనిచేయాలని బిజెపి నాయకుడు కె. అన్నామలై అన్నారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.