
BCCI Revenue From IPL 2025: ఐపీఎల్ 2025 (IPL 2025) ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఈ ఫైనల్లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ (RCB vs PBKS) జట్టును ఆరు పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ట్రోఫీని గెలుచుకుంది. దీంతో, రెండు నెలలకుపైగా కొనసాగిన లీగ్ గ్రాండ్గా ప్రారంభమైంది. విజేతలకు బీసీసీఐ నుంచి భారీ బహుమతి కూడా లభించింది. ఇది మాత్రమే కాదు, ఈ సీజన్లో అన్ని జట్లకు అంచనాలకు మించి ఆదాయం లభించింది. ఒకవైపు, ఫ్రాంచైజీల ఆదాయం, మరోవైపు, ఐపీఎల్ నిర్వాహక బీసీసీఐ కూడా 20 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని పొందింది.
ఐపీఎల్ నిర్వహణ ద్వారా బీసీసీఐకి అతిపెద్ద ఆదాయం ప్రసార రుసుములే. దీని ప్రకారం, బీసీసీఐ 2025 ఐపీఎల్ ప్రసార హక్కులను రూ.9678 కోట్లకు విక్రయించింది. అలాగే, ఒకే మ్యాచ్ నుంచి వచ్చే ఆదాయం దాదాపు రూ.130.7 కోట్లుగా చెబుతున్నారు. ఈ లీగ్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ సొంతం చేసుకోగా, డిజిటల్ హక్కులను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని వయాకామ్ సొంతం చేసుకుంది.
ప్రకటనదారుల సంఖ్యలో భారీ పెరుగుదల..
‘ఎకనామిక్ టైమ్స్’ నివేదిక ప్రకారం, IPL 2025లో ప్రకటనదారుల సంఖ్య 27% పెరిగి 105కి చేరుకుంది. గత సంవత్సరం, టాటా గ్రూప్ రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా ఉండటానికి రూ.2500 కోట్లకు ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం, టాటా గ్రూప్ ప్రతి ఎడిషన్కు IPL టైటిల్ స్పాన్సర్షిప్ కోసం రూ.500 కోట్లు ఇస్తుంది. దీంతో పాటు, బీసీసీఐ ఆదాయ భాగస్వామ్య నమూనా ఆధారంగా అనేక కంపెనీల నుంచి డబ్బును పొందుతుంది.
బీసీసీఐకి అతిపెద్ద ఆదాయ వనరు..
ప్రతి జట్టు నుంచి బీసీసీఐ సెంట్రల్, స్పాన్సర్షిప్, టికెట్ ఆదాయంలో 20 శాతం, లైసెన్సింగ్ ఆదాయంలో 12.5 శాతం పొందుతుంది. బీసీసీఐ ప్రతి జట్టుకు లీగ్ స్థానం ఆధారంగా స్థిర సెంట్రల్ ఇన్కం, వేరియబుల్ ఆదాయాన్ని అందిస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో, బీసీసీఐ తన ఆదాయాన్ని పెంచుకుంది. దీని ద్వారా రూ. 20,686 కోట్లు భారీగా సంపాదించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కూడా బీసీసీఐ రూ. 16,493 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..