శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు ఒక భారీ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయిం ది. మస్కట్కి చెందిన వ్యక్తి సుందర్, అతని భారత భాగస్వామి సత్యనారాయణ కలిసి శతృవుల్లా అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడు తున్నారు. ఇద్దరూ కలిసి దాదాపు 2 నుండి 4 లక్షల వరకు వసూలు చేస్తూ, దుబాయ్ షేక్లకు అమ్మేస్తున్న వైనం భయాందోళనలు కలిగి స్తుంది. మీరు డబ్బులు కట్టనవసరం లేదు, అన్నీ నేనే చూసుకుంటా అంటూ విశ్వాసం కలిగించి, లక్షలాదిమంది అమాయకులను మోసం చేశారు. టికెట్లు, విజిట్ వీసాలు పంపించి, అక్కడి షేక్లకు అప్పగిస్తూ వాణిజ్యంగా మార్చేశారు. ఈ హృదయ విదారక కథకు ముగింపు కావాల్సిందేనన్న ఉద్దేశ్యంతో శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు చాకచక్యంగా వల వేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల సహకారంతో సత్యనారాయణను అరెస్టు చేశారు. సత్యనారాయణ గల్ఫ్ దేశాలకు పిఓఈ (ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్) సర్టిఫికెట్ లేకుండా మహిళలను అక్రమంగా గల్ఫ్ దేశాలకు పంపేందుకు ఉమెన్ ట్రాఫికింగ్ ముఠాకు చెందిన వాడిగా వెల్లడైంది.
వర్క్ వీసాకు బదులుగా విజిటింగ్ వీసాలు ఇప్పించి మోసాలకు పాల్ప డుతున్న సత్యనారాయణపై ఎయిర్పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లంకపల్లి మేరీ అనే మహిళకు వర్క్ వీసాకు బదులుగా విజిటింగ్ వీసాను సత్యనారాయణ ఇప్పించాడు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న లంకపల్లి మేరీతో పాటు కొండలమ్మను ఇమ్మిగ్రేషన్ అధికారులు చెకింగ్ చేయడంతో వారు వర్క్ వీసాకు బదులు విజిటింగ్ వీసాపై వెళుతున్నట్లు తేలింది. ఇద్దరు బాధితులను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించడంతో సత్యనారాయణ చేతిలో మేరీ, కొండలమ్మ మోసపోయినట్లు వెల్లడైంది. సత్యనారాయణపై చీటింగ్, మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మస్కట్లో ఉంటున్న సుందర్ కోసం వేట ప్రారంభమైంది. ప్రస్తుతం సుందర్ రోల్డ్ గోల్ వ్యాపారం చేస్తున్నానంటూ మస్కట్ నుంచి అధికారులను మాయ చేస్తూ ఉంటాడట.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగ ఆశతో బయల్దేరిన పలువురు ఎడారి దేశాల్లో కష్టాల కూడు తింటున్నారు. అక్కడ దుబాయ్ షేక్ల వద్ద వెట్టి చాకిరి చేస్తూ బానిసల జీవితం గడుపుతున్నారు. సుందర్ ముఠా నకిలీ వర్క్ పర్మిట్లు తయారు చేసి, ఇమ్మిగ్రేషన్ అధికారులను కూడా మోసం చేయాలని ప్రయత్నించింది. కానీ పోలీసుల విజ్ఞతతో సత్యనారాయణ ఆట కట్టైంది. ఇప్పటికే సుందర్పై కేసు నమోదయ్యింది. త్వరలో అతనిపై లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. దుబాయ్ షేక్ల వలలో చిక్కుకున్న కొంతమంది బాధితులు తృటిలో తప్పించుకున్నా రు. కానీ ఇంకా ఎందరో అక్కడ బంధించబడి ఉన్నారు.