
కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళుతున్న వినయ్(20) అనే యువకుడు పాండు బస్తీకి వెళ్లే టర్నింగ్ వద్ద అదుపు తప్పి లారీ వెనుక టైర్ల కింద పడ్డాడు. తీవ్ర గాయాలతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. లారీ డ్రైవర్ను పోలీసుల అదుపులో తీసుకున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పరిధిలో ఇలాంటి ఊహించని ఘోరం మరొకటి జరిగింది. నవ వరుడు రైలు కింద పడి చనిపోయాడు. పెళ్లి జరిగి మూడు నెలలు.. హనీమూన్ కోసం సాయి, అతని భార్య మాధురి గోవాకు వెళ్లేందుకు సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చారు. సాయి బావమరిది కూడా ముగ్గురు ఫ్రెండ్స్తో పాటు వీళ్లతో పాటే గోవాకు వెళుతున్నారు. వరంగల్ నుంచి సికింద్రాబాద్కు వచ్చి అందరూ గోవా వెళ్లే వాస్కోడిగామ ట్రైన్ ఎక్కారు. ట్రైన్ కదలకపోవడంతో సాయి వాటర్ బాటిల్ కోసం రైలు దిగాడు. ఇంతలోనే ట్రైన్ కదిలింది.
సాయి బయట ఉండడంతో ట్రైన్లో ఉన్న ఫ్రెండ్స్ స్టాప్ చైన్ లాగారు. ట్రైన్ చైన్ లాగిన సాయి ఫ్రెండ్స్ను ఆర్పీఎఫ్ పోలీసులు కిందకు దించి విచారించారు. తన ఫ్రెండ్స్ చైన్ లాగడం తప్పే అని, ఫైన్ కడతామని అంటుండగా ట్రైన్ మళ్లీ కదిలింది. తన భార్య, బావ మరిది ట్రైన్లో ఉండడంతో సాయి కదులుతున్న ట్రైన్ బోగీ ఎక్కబోయాడు. ప్లాట్ ఫాం మధ్య కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. సాయిని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నవ వధువు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని రైల్వే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.