దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు అవుతున్నా రవాణా సౌకర్యం లేక ఆదివాసీలు అవస్థలు పడుతూనే ఉన్నారు. మారుమూల ఏజెన్సీ గ్రామాల వాసులకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా ఆదివాసీ మహిళలు, ముఖ్యంగా గర్భిణులు, రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల పురిటినొప్పుల సమయంలో తీవ్ర కష్టాలు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. గ్రామానికి అంబులెన్స్ వెళ్లడానికి వీల్లేక, రోడ్డు మార్గం లేకపోవడం వల్ల వారు ఆసుపత్రికి చేరడానికి చాలా రష్టపడవలసి వస్తోంది. దీని వల్ల గర్భిణులు, వారి శిశువుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం,
టీం కొత్తగూడెం పంచాయతీ ఉమేష్ చంద్రనగర్లో ఇలాంటి హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. మొడియం జానకి అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు రావడంతో రహదారి సౌకర్యం లేక మంచానికి కట్టి మోసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో పురిటి నొప్పులతోనే ఆ మహిళ పడిన వేదన వర్ణనాతీతం. ఆ గ్రామానికి రహదారి లేకపోవడంతో అక్కడే 108 వాహనం రాలేక ఆగిపోయింది. దీంతో గ్రామస్థులు మంచానికి కర్రలు కట్టి, ఆమెను అందులో పడుకోబెట్టి కొంతదూరం మోసుకెళ్లారు. అక్కడి నుండి ఆమెను అంబులెన్స్లో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.