
రీల్ లైఫ్ లో ఎక్కువగా విలన్ గా కనిపించే సోనూసూద్ రియల్ లైఫ్లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. కరోనా ఆపత్కాలంలో అతను అందించిన సేవలు, సహాయక కార్యక్రమాలు, దాన ధర్మాలను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఆ తర్వాత కూడా సోనూ సేద్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సహాయక కార్యక్రమాలు చేస్తున్నాడీ రియల్ హీరో. ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగులో బిజీగా ఉంటోన్న సోనూసూద్ ఇటీవల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నాడు. అయితే తిరుగు ప్రయాణంలో భాగంగా తిరుమల అంతా కలియ తిరిగాడు సోనూసూద్. ఇదే క్రమంలో తిరుమలలో తట్టపైన బేల్ పూరి విక్రయిస్తున్న చిరువ్యాపారి జ్యోతితో సరదాగా ముచ్చటించాడు. ఆమె కుటుంబ విషయాలు, యోగక్షేమాలు, అలాగే వ్యాపార విషయాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇక బేల్ పూరి ధర అడిగి తెలుసుకున్న సోనూసూద్ ఆ తర్వాత ఆమె దగ్గర కొను గోలు చేసి రుచి చూశాడు. భేల్ పూరి చాలా బాగుందని ఆమెకు కితాబిచ్చాడు. చిరు వ్యాపారుల దగ్గర మనం కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని సోనూసూద్ చెప్పడంతో జ్యోతి చాలా సంబరపడిపోయింది. గత 25 సంవత్సరాలుగా తిరుమలలో భేల్ పూరి విక్రయిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా స్టార్ అయినా ఓ సాధారణ వ్యక్తిలా భేల్ పూరి కొను గోలు చేసి జ్యోతితో ముచ్చటించాడు సోనూ సూద్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు సోనూ సూద్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తిరుమల వీధుల్లో సోనూ సూద్.. వీడియో..
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నంది పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సోనూ సూద్. ఇందులో తాను నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నట్లు తెలిపాడు. ‘ నంది పేరుతో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాం. అందులో నేను నటిండటంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నాను. త్వరలోనే మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను’ అని సోనూ చెప్పుకొచ్చాడు.
అవార్డుతో రియల్ హీరో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.