. < 1 minute

ఈఎన్‎సీ జనరల్‎గా అనిల్ కుమార్.. పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించిన ఇరిగేషన్​ శాఖ

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​లో కీలక విభాగాలకు అధిపతులను సర్కారు నియమించింది. ఇన్నాళ్లూ ఈఎన్​సీ జనరల్​గా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఈఎన్​సీ అడ్మిన్ అనిల్ కుమార్​ను.. పూర్తి స్థాయిలో ఈఎన్​సీ జనరల్​గా నియమించింది. ఈ మేరకు ఈఎన్​సీ అడ్మిన్ నుంచి ఈఎన్​సీ జనరల్‎గా ట్రాన్స్ ఫర్ చేస్తూ బుధవారం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు గత ఫిబ్రవరిలో ఖాళీ అయిన ఈఎన్​సీఓ అండ్ ఎం పోస్టునూ భర్తీ చేశారు. ఆదిలాబాద్ సీఈగా పనిచేస్తున్న టి.శ్రీనివాస్​కు ఈఎన్​సీఓ అండ్ ఎం, క్వాలిటీ కంట్రోల్‎గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇటు అనిల్ కుమార్ ట్రాన్స్​ఫర్‎తో ఖాళీ అయిన ఈఎన్​సీ అడ్మిన్ పోస్టులో మహ్మద్ అంజద్ హుస్సేన్‎ను నియమించారు. ప్రస్తుతం ఆయన సీఈ (ఎంక్వైరీస్)గా పనిచేస్తుండగా.. ఇప్పుడు ఈఎన్‎సీ అడ్మిన్‎గా అదనపు బాధ్యతలను అప్పగించారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.