
పెబ్బేరు, వెలుగు : కల్తీ కల్లు తయారు చేసేందుకు వినియోగించే ఆల్ఫ్రాజోలం ఫౌడర్ ను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పెబ్బేరు ఎస్ఐ యుగంధర్రెడ్డి వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన నరసింహాగౌడ్ , భాస్కర్ గౌడ్ ఆల్ఫ్రాజోలాన్ని అక్రమంగా కల్లు దుకాణాలు నడిపే వ్యక్తులకు విక్రయించేవాడు. ఈ క్రమంలోనే నరసింహాగౌడ్ కర్నూలు జిల్లాకు చెందిన హర్షవర్ధన్ గౌడ్, జగదీశ్ గౌడ్, గోపాల్ గౌడ్ అనే ముగ్గురు వ్యక్తుల నుంచి ఆల్ఫాజోలం తీసుకొచ్చి గద్వాల జిల్లాకు చెందిన భాస్కర్ గౌడ్ కు ఇచ్చాడు.
అతడు కల్లు దుకాణాలు నడుపుతున్న అనంతపురం జిల్లాకు చెందిన కుమార్ గౌడ్, కర్నూలకు చెందిన లక్ష్మన్న గౌడ్, పండ్ల రమేశ్, గజేంద్రగౌడ్, నాగర్కర్నూల్ చెందిన యుగంధర్ గౌడ్ కు విక్రయించేవాడు. అందులో భాగంగానే గురువారం సాయంత్రం కర్నూలు నుంచి ఆల్ఫ్రాజోలం తీసుకొచ్చి పెబ్బేరు మార్కెట్ యార్డులో విక్రయిస్తుండగా పక్కా సమాచారంతో నరసింహాగౌడ్, భాస్కర్ గౌడ్ ను పెబ్బేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 500 గ్రాముల ఆల్ఫ్రాజోలం పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.