కాప్రా: కూతురును వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు బాలుడిని కర్రలతో కొట్టి చంపారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జవహర్నగర్ ప్రాంతం ప్రగతి నగర్లో ఎండి రిజ్వాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. రిజ్వాన్ సెక్యూర్టీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. రిజ్వాన్ కుమార్ పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. వేసవి సెలవుల్లో క్యాటరింగ్ బాయ్గా పని తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు.
గురువారం సైనిక్పూరిలో ఓ ఫంక్షన్ హాట్ క్యాటరింగ్కు వెళ్లాడు. పని ముగిసిన తరువాత ఇద్దరు స్నేహితులతో కలిసి వీరారెడ్డి ఎన్క్లేవ్ వద్దకు వెళ్లాడు. అయాన్ స్నేహితుడికి ఫోన్ వచ్చింది. తన కూతురిని వేధించడం మానుకోవాలని హెచ్చరించాడు. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కర్రలతో అయాన్ ను చితక్కొట్టారు. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.