. < 1 minute
Harish Rao Slams Revanth And Uttam Over Kaleshwaram Project

Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం నిర్మాణంపై ఇష్టారీతిగా వ్యాఖ్యానిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్టే కనిపిస్తుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌లను వాడుకుంటూనే ప్రాజెక్టును ‘వైట్ ఎలిఫెంట్’గా అభివర్ణించడం హాస్యాస్పదమని హరీష్ వ్యాఖ్యానించారు. ఇది కనీస సామాన్య బుద్ధి లేని వ్యవహారమని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రయోజనం కలిగించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏడాదిన్నరుగా కుట్రలు చేయడం తప్ప, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు నీళ్లు కూడా అందించలేదని విమర్శించారు.

Lion Attack: సింహానికి టచ్ ఇచ్చాడు.. వెంటనే స్ట్రెచర్ ఎక్కాడు..!

తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చినట్లు కామెంట్లు చేస్తూ కమిషన్ల కోసమే మార్పు జరిగిందన్న ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కానీ ఫిబ్రవరి 18, 2015, మార్చి 4, 2015 తేదీల్లో సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) పంపిన లేఖల్లో తుమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదని పేర్కొనడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు తెలంగాణకు మంచిచేయక పోయినా, రాష్ట్ర అభివృద్ధి పథంలో వచ్చిన ప్రాజెక్టులపై బురద చల్లే ప్రయత్నాల్లో మాత్రమే తలమునకలై ఉన్నారని హరీష్ రావు అన్నారు. వీరే నిజమైన వైట్ ఎలిఫెంట్లుగా మారారని తీవ్ర విమర్శలు చేశారు. ఒకరు రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతుంటే, మరొకరు నీటి వాటాకు ప్రమాదం కలిగిస్తున్నారని ఆరోపించారు.

Mani Ratnam : భారీ కలెక్షన్స్ కోసమే సినిమాలు చేయొద్దు.. మణిరత్నం హాట్ కామెంట్స్..

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.