
హైదరాబాద్కుషాయిగూడలో దారుణం జరిగింది. ఓ కుటుంబసభ్యులు అంతా కలిసి మైనర్ బాలుడిపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బాలుడిని ట్రాప్ చేసిన కుటుంబ సభ్యులు దాడి చేయగా.. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…
కుషాయిగూడ పరిధిలోని రాధిక సెంటర్ దగ్గరలో హత్య జరిగింది. 16 సంవత్సరాల అయాన్ అనే యువకుడిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసింది.
జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో అయన్ తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు. గుర్తు తెలియని ఓ యువకుడు అయాన్ కి కాల్ చేసి .. ఫోన్ లో బూతులు తిట్టాడు. దానితో రాథికా థియేటర్ సమీపానికి రావాలని, అక్కడ మాట్లాడుకుందామని పిలిచారు. నీవు ఎక్కడ ఉంటావు.. మా అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నావు.. అనిఅడిగారు. తాను ఎక్కడ ఉంటున్నాడో ఆ అమ్మాయి కుటుంబసభ్యులకు చెప్పాడు.
ఇంతలో బైక్లపై వచ్చిన కొంతమంది అయాన్ ను చితకబాదారు. దీంతో అయాన్ అపస్మారక స్థితిలో పడి పోయాడు. అది గమనించిన స్థానికులు 108 కి కాల్ చేసి సమాచారం ఇచ్చి… అంబులెన్స్ కాప్రా లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తుండగా చనిపోయాడని కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్పిటల్ కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించి దర్యాప్తు చేస్తున్నారని, మృతునిపై దాడి చేసిన వారిలో ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.