కాళేశ్వరంపై ఎన్డిఎస్ఎ,
విజిలెన్స్ నివేదికలపై మంత్రుల
అభిప్రాయాలు తెలుసుకున్న
సిఎం రేవంత్ విద్యాశాఖలో
మరో డైరెక్టర్ నియామకం
విద్యుత్ శాఖలో 300
పోస్టులకు కేబినెట్ గ్రీన్సిగ్నల్
స్పెషల్ ఎక్సైజ్ సెస్ అమలుకు
అంగీకారం కొత్తగూడెం
హెల్త్ సైన్స్ వర్శిటీకి
మన్మోహన్ పేరు హామ్
విధానంలో రోడ్ల నిర్మాణం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెలాఖరు లేదా, జూలైలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై మం త్రివర్గం చర్చించింది. దీంతోపాటు ఉద్యోగుల డిమాండ్లపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. ఉద్యోగులకు సంబంధించి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గం పలు సూచనలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లింపులు, ఆరోగ్య భద్రతతో పాటు పెండింగ్ బిల్లుల చెల్లింపుపై మంత్రివర్గం చర్చించింది. 300 పేజీల ఎన్డిఎస్ఏ నివేదిక, 150 పేజీల విజిలెన్స్ నివేదికలపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వగా ఆ నివేదికలపై మంత్రుల అభిప్రాయాలను సిఎం రేవంత్రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ భూములను టిజిఐఐసికి బదిలీ చేయాలని నిర్ణయించడంతో పాటు స్పె షల్ ఎక్సైజ్ సెస్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖలో మరో డైరెక్టర్ నియామకం చేపట్టాలని మంత్రి మండలి నిర్ణయించింది. విద్యుత్ శాఖలో 300 పోస్టుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జహీరాబాద్ ఇండస్ట్రీయల్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళా సంఘాలకు ప్రమాద బీమా అమలు కోసం రూ.38.5 కోట్లను స్త్రీనిధికి కేటాయించాలని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించకుండా నేరుగా స్త్రీనిధి ద్వారా 385 బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. రూ.23 వేల కోట్లతో గ్రామీణ రోడ్లను ఆధునీకికరించాలని మంత్రివర్గం నిర్ణయం. కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించమన్నారు. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కేరాఫ్గా కొత్తగూడెం నిలిచింది. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీతో తెలంగాణ ఖ్యాతి పెరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశం సుమారుగా ఐదున్నర గంటల పాటు కొనసాగింది.