
సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మొగుతున్నాయి. పలువురు నటీనటులు వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా అక్కినేని అఖిల్ తన ప్రియురాలు జైనబ్ ను పెళ్లాడారు. ఇప్పుడు మరో జంట త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది. తెలుగు బిగ్బాస్ 7 సీజన్ శుభశ్రీ రాయగురు ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్ మైసూర్ను పెళ్లాడబోతుంది. తాజాగా శుభశ్రీ నిర్మాతతో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది.
Also Read:Mayawati: బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిరోజులొస్తాయి
ఫైనల్లీ.. మా ఎంగేజ్మెంట్ జరిగిందని క్యాప్షన్ జోడించింది. ఇది తెలిసిన అభిమానులు, పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒడిశాకి చెందిన శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యింది. అంతకు ముందు.. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. అయితే సినిమాల ద్వారా సంపాదించలేకపోయిన క్రేజ్ బిగ్ బాస్తో రాబట్టింది.