
ఈద్ అల్-అధా లేదా ఈద్ ఉల్-జుహా లేదా బక్రీద్ అని కూడా పిలుస్తారు. ఇది ఇస్లాం రెండవ పవిత్ర పండుగ. జూన్ 7, శుక్రవారం భారతదేశంలో దీనిని జరుపుకునే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ బక్రీద్ పండగ ఖచ్చితమైన తేదీ నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజున పండుగను పురస్కరించుకుని చాలా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ అయితే బక్రీద్ సందర్భంగా ఆర్బీఐ బ్యాంకులకు సెలవు ప్రకటించింది. అలాగే 8వ తేదీన ఆదివారం అవుతుంది. సాధారణంగా ఈ రోజు బ్యాంకులకు సెలవు.
బక్రీద్ సందర్భంగా తిరువనంతపురం, కొచ్చిలోని బ్యాంకులు శుక్రవారం, జూన్ 6, 2025న మూసి ఉంటాయి. జూన్ 7, 2025 శనివారం నాడు అహ్మదాబాద్, గ్యాంగ్టాక్, ఇటానగర్, కొచ్చి, తిరువనంతపురం మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ముఖ్యంగా జూన్ 7, 2025 నెలలో మొదటి శనివారం, కాబట్టి అహ్మదాబాద్, గ్యాంగ్టక్, ఇటానగర్, కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులు తెరిచి ఉంటాయి.
ఇది కూడా చదవండి: Auto Driver: ఈ ఆటో డ్రైవర్ నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
స్టాక్ మార్కెట్ మూసి ఉంటుందా?
బక్రీద్ సందర్భంగా NSE, BSEల సెలవు క్యాలెండర్ ప్రకారం, భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం, జూన్ 6, 2025, శనివారం, జూన్ 7, 2025 రెండు రోజుల్లోనూ తెరిచి ఉంటుంది. అందువల్ల బక్రీద్ నాడు భారత స్టాక్ మార్కెట్ మూసి ఉండదు. అయితే బక్రీద్ సందర్భంగా బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఇతర ఆన్లైన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వీటికి ఎటువంటి ఆటంకం ఉండదు. NEFT, RTGS, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ మాధ్యమాలు అందుబాటులో ఉంటాయి. కానీ, చెక్ క్లియరెన్స్, నగదు విత్డ్రావల్/డిపాజిట్ వంటి సేవలు అందుబాటులో ఉండవు. ఆ రోజు అవసరమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేయడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: IRCTC: ప్రయాణికులకు అలర్ట్.. ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం.. ఇలా చేయకపోతే తత్కాల్ టికెట్స్ బుక్ చేయలేరు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి