. < 1 minute
Gold And Silver Rates Today In Hyderabad On 6th June 2025

ఈ వారంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. వరుసగా పెరిగిన పసిడి.. మళ్లీ లక్ష రూపాయలకు చేరుకుంది. వరుసగా నాలుగు రోజులు పెరిగిన గోల్డ్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జూన్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,300గా.. 24 క్యారెట్ల ధర రూ.99,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అయితే జీఎస్టీ, ఇతర ఛార్జీలతో కలిపి తులం బంగారం లక్ష రూపాయలు దాటుతుంది.

Also Read: Bunny Vasu: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి!

మరోవైపు వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. గత ఐదు రోజులుగా వెండి ధర భారీగా పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై ఏకంగా రూ.3000 పెరిగి.. రూ.1,07,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,17,000గా నమోదైంది. దేశంలోని ప్రధాన నాగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి రూ.1,07,000గా ఉంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.