. < 1 minute

ఆయుష్మాన్ మందిర్ లో నాణ్యమైన వైద్యం

Caption of Image.

ఎల్కతుర్తి, వెలుగు: కేశవాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో నాణ్యమైన వైద్య సేవలు  అందుతున్నాయని డీఎంహెచ్​వో  అప్పయ్య అన్నారు. జాతీయ వైద్య బృందం డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ కృష్ణ సరన్ ఈ ఆరోగ్య మందిర్​ను గురువారం వర్చువల్ గా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ క్యూఏఎస్ మేనేజర్​సాగర్ తో కలిసి డీఎంహెచ్​వో  సందర్శించారు. 

బిల్డింగ్ నిర్మాణం, హెర్బల్ గార్డెన్, బయో మెడికల్ వేస్టేజ్, పేషెంట్లు, గర్భిణులు, నవజాత శిశువులకు అందుతున్న సేవలు, కుటుంబ నియంత్రణ తదితరాల అమలు తీరును వైద్య బృందానికి వివరించారు. పీహెచ్​సీ వైద్యుడు శ్రీనాథ్​, పల్లె దవాఖాన మెడికల్​ఆఫీసర్ అరవింద్, వైద్యులు దుర్గాప్రసాద్, కవిత, భవాని తదితరులున్నారు.  

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

హసన్ పర్తి, వెలుగు: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ వో  అప్పయ్య సూచించారు. టీబీ సర్వేలో భాగంగా గురువారం హసన్ పర్తి పీహెచ్​సీని తనిఖీ చేశారు. 24 మందికి టీబీ, 27 మందికి హెచ్ఐవీ పరీక్షలు చేసినట్లు టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ హిమబిందు తెలిపారు. ఏఎన్ఎం సులోచన, హెల్త్ అసిస్టెంట్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.