
ఎల్కతుర్తి, వెలుగు: కేశవాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని డీఎంహెచ్వో అప్పయ్య అన్నారు. జాతీయ వైద్య బృందం డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ కృష్ణ సరన్ ఈ ఆరోగ్య మందిర్ను గురువారం వర్చువల్ గా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ క్యూఏఎస్ మేనేజర్సాగర్ తో కలిసి డీఎంహెచ్వో సందర్శించారు.
బిల్డింగ్ నిర్మాణం, హెర్బల్ గార్డెన్, బయో మెడికల్ వేస్టేజ్, పేషెంట్లు, గర్భిణులు, నవజాత శిశువులకు అందుతున్న సేవలు, కుటుంబ నియంత్రణ తదితరాల అమలు తీరును వైద్య బృందానికి వివరించారు. పీహెచ్సీ వైద్యుడు శ్రీనాథ్, పల్లె దవాఖాన మెడికల్ఆఫీసర్ అరవింద్, వైద్యులు దుర్గాప్రసాద్, కవిత, భవాని తదితరులున్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
హసన్ పర్తి, వెలుగు: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ వో అప్పయ్య సూచించారు. టీబీ సర్వేలో భాగంగా గురువారం హసన్ పర్తి పీహెచ్సీని తనిఖీ చేశారు. 24 మందికి టీబీ, 27 మందికి హెచ్ఐవీ పరీక్షలు చేసినట్లు టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ హిమబిందు తెలిపారు. ఏఎన్ఎం సులోచన, హెల్త్ అసిస్టెంట్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.