. < 1 minute
Covid 19 India Update Coronavirus Cases Hits 5k And 4 Deaths Reported

దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా బారిన పడిన వారి సంఖ్య నేటికి ఐదు వేలు దాటింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,364గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు రాష్ట్రాలలో 4,724 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ఇప్పటివరకు వైరస్‌తో దేశవ్యాప్తంగా 55 మంది మరణించినట్లు పేర్కొంది.

గత 24 గంటల్లో 498 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో వైరస్‌తో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు కేరళకు చెందిన వారు కాగా.. కర్ణాటక, పంజాబ్‌లలో ఒక్కొక్కరు ఉన్నారు. కేరళలో అత్యధికంగా 1,679 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గుజరాత్ (615), పశ్చిమ బెంగాల్ (596), ఢిల్లీ (562) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఉన్న విషయం తెలిసిందే.

Also Read: OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్‌ హిట్‌ మూవీ!

ప్రధాన రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య:
ఢిల్లీ – 562 కేసులు
గుజరాత్ – 615 కేసులు
కర్ణాటక – 451 కేసులు
కేరళ – 1,679 కేసులు
మహారాష్ట్ర – 548 కేసులు
రాజస్థాన్ – 107 కేసులు
తమిళనాడు – 221 కేసులు
ఉత్తరప్రదేశ్ – 205 కేసులు
పశ్చిమ బెంగాల్ – 596 కేసులు

 

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.