. < 1 minute

Job News : హిందుస్తాన్ షిఫ్ యార్డులో మేనేజర్ ఉద్యోగాలు.. డిగ్రీ, బీటెక్, పీజీ డిప్లొమా ఉంటే చాలు..!

Caption of Image.

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి విశాఖపట్నం హిందుస్థాన్ షిప్​యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 3.

పోస్టుల సంఖ్య: 26

పోస్టులు: మేనేజర్ 22, డిప్యూటీ మేనేజర్ 01, సీనియర్ మేనేజర్ 01, డిప్యూటీ జనరల్ మేనేజర్ 01, అడిషనల్ జనరల్ మేనేజర్ 01.

డిపార్ట్​మెంట్స్: ఐటీ అండ్ ఈఆర్ పీ, ఫైనాన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ, లీగల్, టెక్నికల్, సబ్​మెరైన్, కంపెనీ, సెక్రటరీ, హ్యూమన్ రిసోర్స్.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్ లేదా బీఈ, ఎల్ఎల్​బీ, పీజీ, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతోపాటు ఐసీఏఐలో సభ్యుడై ఉండాలి. 

వయోపరిమితి: మేనేజర్ 40 ఏండ్లు, డిప్యూటీ మేనేజర్ 35 ఏండ్లు, సీనియర్ మేనేజర్ 42 ఏండ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ 45 ఏండ్లు, అడిషనల్ జనరల్ మేనేజర్ 48 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 3.

లాస్ట్ డేట్: జులై 3

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్​బీడబ్ల్యూ అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ.300.

సెలెక్షన్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.