
లిచీ పండు ఒక పోషకమైన పండు, పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఎర్రని తొక్కతో లోపల తెల్లని జెల్లీ లాంటి గుజ్జుతో కనిపించే ఈ లిచీ పండు కేవలం వేసవిలోనే దొరుకుతుంది. వీటిని చూడగానే నోరూరుతుంది. అందుకే ఎక్కువమంది వీటిని తినడానికి ఇష్టపడతారు. అయితే, లిచీ కేవలం రుచిలోనే మాత్రమే కాదు..ఈ పండ్లలో పోషకాలు కూడా ఎక్కువే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. లిచీ తినడం వల్ల శరీరానికి అధిక లాభాలు ఉన్నాయి. అయితే, డయాబెటీస్ ఉన్నవారు లిచీ పండ్లు తింటే ఏమౌతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న లిచీ పండ్లు సహజంగానే తీపి చక్కెరను కలిగి ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల త్వరగా ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దంత క్షయం ఏర్పడే అవకాశం కూడా ఉందంటున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు లిచీ తినవద్దు. లిచీ పండులో 15 గ్రాముల సహజ చక్కెర ఇందులో ఉంటుంది. అంతేకాదు లిచీ పండులో గ్లైసెమిక్ సూచీ కూడా 50 కంటే ఎక్కువగా ఉంది. అయితే, ఎక్కువ మొత్తం తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో లిచీని తీసుకోండి. టెట్రాప్యాక్ల్లో అమ్మేటువంటి లిచీ లేదా లిచీ జ్యూస్ తాగడం మానుకోండి.
అంతేకాదు.. అధిక రక్తపోటు ఉన్నవారు రోజుకు రెండు మూడు లిచీ పండ్లను తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ, అధికంగా తింటే మాత్రం బీపీ లెవల్స్ బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. దీంతో నీరసం, మూర్ఛ, అలసట వంటివి వస్తాయి. సాధారణంగానే లిచీ పండ్లను ఎక్కువగా తినడం వల్ల అనేక అలర్జీలు కలిగే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. దురద, వాపు, ఎరుపుగా మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.
(నోట్: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..