
సరీసృపాలలో భారీ కాయంతో, అలాగే అత్యంత పొడవుగా పెరిగేవి కొండచిలువలు. ఇవి అమాంతం మనుషులను సైతం మింగేస్తాయి. అలాంటి కొండచిలువలను దూరం నుంచి చూస్తేనే దెబ్బకు దడుసుకుంటాం. సరిగ్గా ఆ తరహ ఓ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిక్కటంపల్లి గ్రామంలోని ఓ మామిడితోటలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. స్థానిక మామిడితోటలో పని చేస్తోన్న కూలీలు.. ఆ కొండచిలువను చూసి దెబ్బకు షాక్ అయ్యారు. విషయాన్ని వెంటనే తోట యజమాని రిటైర్డ్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డి తెలిపారు. అతడు స్నేక్ క్యాచర్, ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించాడు. సుమారు 15 అడుగులు, 30 కేజీల బరువున్న ఆ కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని.. ఆ తర్వాత సమీపంలోని అడవి ప్రాంతంలో విడిచిపెట్టారు అధికారులు. కాగా, స్థానికంగా ఎవరికైనా పాములు, వన్య ప్రాణులు కనిపిస్తే.. వాటికి దూరంగా జరిగి.. వెంటనే తమకు సమాచారం అందించాలని స్నేక్ సొసైటీ సభ్యులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి