
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీ సంచలన విజయం సాధించి మొదటిసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ సాధించిన విజయాన్ని తమ విజయంగా భావించారు. బాణాసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలారు.
మెట్రో సిటీలలో అభిమానం శృతి మించింది. రోడ్లపైకి వచ్చి క్రాకర్స్ కలుస్తూ అలజడి సృష్టించారు. వాహనదారుల్ని రోడ్డుపై నిలిపివేసి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కొందరు బట్టలిప్పి నానా హంగామా చేశారు. ఆర్టీసీ బస్సులపై ఎక్కి ఆర్సీబీ జెండాలతో నినాదాలు పలికారు. ఇంకొందరు కార్లపైకి ఎక్కి రచ్చ రచ్చ చేశారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి గూండాల్లా ప్రవర్తించారు. ఏకంగా తెలంగాణ సెక్రటేరియట్ ముందు బాణాసంచా కాలుస్తూ నానా హంగామా చేశారు. బట్టలిప్పి బస్సులపై, వచ్చిపోయే లారీలపైకి ఎక్కి పైశాచిక ఆనందం పొందారు. ఆర్సీబీ చాన్నాళ్ల తర్వాత కప్ గెలవడంతో సంతోషం ఉండొచ్చు.. బట్ ఇలా శృతిమించి ప్రవర్తిస్తే అది సొసైటీకి చెడ్డ పేరు తీసుకొస్తుంది.
Also Read: Eatala Rajendar: అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం.. అన్నీ కేబినెట్ నిర్ణయం మేరకే!
హైదరాబాద్ లాంటి మహానగరంలో జూన్ 3 అర్ధరాత్రి జరిగిన సంఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ తీసేలా అభిమానులు ప్రవర్తించారన్న పేరు వచ్చింది. దీనిపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘బెంగళూరు తొక్కిసలాట చూసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని ఆశ్చర్యం కలిగింది. ఆర్సీబీ ప్రపంచకప్ గెలవలేదు. ఆర్సీబీ జాతీయ జట్టు కాదు. బిజినెస్ పరంగా నడిచే ఓ ఐపీఎల్ ఇది. అర్థరాత్రి 12 గంటలకు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్లపైకి భారీ సంఖ్యలో యువకులు రావడం ఆందోళన కలిగించింది. వాళ్ళని అదుపుచేసేందుకు ఉన్న పోలీసులు చాలక అదనపు బలగాలను దించాల్సి వచ్చింది. పౌరులు భయం, బాధ్యత కలిగి ఉండాలి’ అని సీవీ ఆనంద్ అన్నారు.