. < 1 minute

NEET PG 2025: నీట్ పరీక్ష గడువు పొడిగించిన సుప్రీం.. ఆగస్టు 3న ఎగ్జామ్

Caption of Image.

NEET 2025: నీట్ పరీక్షల విషయంలో సుప్రీం ధర్మాసనం కీలక నేడు తీర్పు ప్రకటించింది. ఇందులో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ అభ్యర్థన మేరుకు ఆగస్టు 3న నీట్ 2025 పరీక్షలు నిర్వహించటానికి అనుమతించింది. గడువు పొడిగింపుకు చేసిన అభ్యర్థనను పూర్తిగా పరిశీలించిన తర్వాత అందుకు అంగీకరిస్తున్నట్లు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఏజీ మసిహ్ బెంచ్ తీర్పును వెలువరించింది. 

అయితే పరీక్షలను ఆగస్టు 3 తర్వాత వాయిదాకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే రెండు నెలలు గడుపు పొడిగింపు ఎందుకని బోర్డును ప్రశ్నించిన కోర్టు సమాధానం కోరింది. అయితే ఏకకాలంలో రెండున్నర లక్షల మంది అభ్యర్థులు 450 సెంటర్లలో పరీక్ష రాస్తారని, పరీక్షణను ఒకే సిట్టింగ్ లో పూర్తి చేయటం కోసం అదనపు సెంటర్ల ఏర్పాటు అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. ఇందుకోసం అవసరమైన అన్ని భద్రతా పరమైన ఏర్పాట్లకు సమయం అవసరమౌతోందని నేషనల్ బోర్డు కోర్టుకు తెలపింది. 

►ALSO READ | చీనాబ్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన బ్రిడ్జి ఇదే

దీనికి ముందు మే 30న సుప్రీం ధర్మాసనం నీట్ పరీక్షలను ఒక్క సిట్టింగులో పూర్తి చేయాలని బోర్డును ఆదేశించిన సంగతి తెలిసిందే. అందువల్ల జూన్ 15న ముందుగా అనుకున్న విధంగా పరీక్ష నిర్వహణకు టెక్నికల్, వాస్తవ పరిస్థితులు సహకరించటం లేదని వెల్లడించింది. అయితే టీసీఎస్ కూడా పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లకు గడువు పడుతుందని చెప్పటంతో ప్రస్తుతం కోర్టు దీనికి అంగీకరించింది. వాస్తవంగా అయితే పరీక్షను రెండు దఫాలుగా నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పరీక్ష ఆలస్యం వల్ల అకడమిక్ సంవత్సరం లేటుగా ప్రారంభించబడుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.