
దగ్గుబాటి హీరో రానా ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. ఆయన నుంచి సాలిడ్ సినిమా కోసం ఫ్యాన్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. రానా ఓ అదిరిపోయే సినిమా చేయాలనీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు కూడా చేస్తున్నారు. కాగా రానా ప్రస్తుత ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా వెబ్ సిరీస్ గా తెరకెక్కిన రానా నాయుడు సిరీస్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ కూడా నటించారు. ఇక ఇప్పుడు రానా నాయుడు 2 రాబోతుంది. ఈ కొత్త సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా రానా ముంబైలో ఉన్నారు. తాజాగా రానా ఫొటోగ్రాఫర్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా రానా ముంబై ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వెళ్తుండగా కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఆయన వెంటపడ్డారు. రానాను ఫోటోలు తీసేందుకు ఆయనను వెంబడించారు. ఈ క్రమంలో ఓ యువతి రానాకు డాష్ ఇచ్చింది. దాంతో ఆయన చేతిలోని ఫోన్ కిందపడిపోయింది. దాంతో రానాకు కోపం తన్నుకొచ్చింది. వంటనే తనను వెంబడిస్తున్న ఫోటోగ్రాఫర్స్ దగ్గరకు వెళ్లి.. ఎందుకు నన్ను ఫోటోలు తీస్తున్నారు. నాకు ఇవి ఇష్టం ఉండదు.. నేను మిమ్మల్ని పిలవలేదు కదా..! పిలిచినా వారి దగ్గరకు వెళ్లి ఫోటోలు తీయండి అంటూ సున్నితంగా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై రానా క్లారిటీ కూడా ఇచ్చారు.
నాకు ఇలాంటివి నచ్చవు.. నాకంటూ పర్సనల్ టైం ఉంటుంది. ఆ టైం లో నన్ను డిస్ట్రబ్ చేస్తే నాకు నచ్చదు. నన్ను వచ్చి ఫోటోలు తీయండి అని నేను ఎవ్వరిని పిలవను ఇదే విషయాన్నీ చాలా సందర్భాల్లో చెప్పను కూడా.. అయినా వారు వినడం లేదు.. ఇది ఒకింత ఇబ్బందికి గురిచేస్తుంది. రీసెంట్ గా ఎయిర్పోర్ట్లో కొంతమంది ఫోటోగ్రాఫర్స్ నన్ను చుట్టుముట్టారు. వాళ్ల నుంచి నేను తప్పించుకునే తొందర్లో ఓ అమ్మాయికి నాకు డాష్ ఇచ్చింది. దాంతో నా ఫోన్ కింద పడిపోయింది. మిమ్మల్ని పిలిచినా వారికి ఫోటోలు తీయండి తప్పులేదు అంటూ రానా వివరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.