
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో డబల్ మర్డర్ కలకలం రేపింది.. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనచైతన్య ఫేస్ 2లో జరిగింది ఈ ఘటన. శుక్రవారం ( జూన్ 6 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. స్థానిక అబ్రిజ్ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ 5వ అంతస్తులో ఉండే షేక్ అబ్దుల్లా ( 70 ) రిజ్వానా ( 65 ) దంపతులను దారుణంగా హత్య చేశారు దుండగులు. వృద్ధ దంపతులు రక్తం మడుగులొ ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డబ్బుల కోసం హత్య చేశారా , లేక మరేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టం నిమితం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో ఇలాంటి దారుణాలు ఎక్కువైపోతున్నాయి…మే 23న బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఆ ట్రావెల్ బ్యాగ్లో ఉన్న మృతదేహం నేపాల్కు చెందిన యువతిగా పోలీసుల విచారణ తేలింది. నిందితుడు నేపాల్కు చెందిన విజయ్గా పోలీసులు గుర్తించారు.
►ALSO READ | యూపీ నుంచి అల్ఫ్రాజోలం ట్యాబ్లెట్లు …హైదరాబాద్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
మే 23న యువతిని హత్య చేసినట్టు దర్యాప్తులో తేలింది. యువతిని హత్య చేసి ట్రావెల్ బ్యాగ్లో పెట్టినట్టు పోలీసుల నిర్ధారించారు. నిందితుడు కేపీహెచ్బీలో ఆ ట్రావెల్ బ్యాగ్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఇద్దరు గత నెలలో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చారు. బాచుపల్లిలో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తూ ఇద్దరూ జీవనం సాగించారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ ఆమెను హత్య చేసి ట్రావెల్ బ్యాగ్లో ప్యాక్ చేశాడు.