
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న రాజాసాబ్ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీతోపాటు డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ 2, నాగ్ అశ్విన్ తో కల్కి 2 చేయాల్సి ఉంది. వీటితోపాటు డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ సైతం ఫిక్స్ చేశారు.
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి స్పిరిట్ పనులు మొదలు పెట్టేశారు. ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనెని ఫిక్స్ చేశాడు. కానీ ఊహించని విధంగా దీపికను ఈ సినిమా నుంచి తప్పించాడు సందీప్. దీపికా కండీషన్స్ నచ్చకే సందీప్ ఆమెను రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. దీపికా ప్లేస్ లో ఇప్పుడు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రిను సెలక్ట్ చేశారు. యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది త్రిప్తి డిమ్రి.
ఇక ఇప్పుడు స్పిరిట్ సినిమాలో మరో ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. మలయాళ ముద్దుగుమ్మ మడోనా సెబాస్టియన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. ప్రేమమ్ సినిమాతో అడుగుపెట్టింది. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది. ఈ భామతో పాటు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ వామిక గబ్బి కూడా నటిస్తుందని తెలుస్తుంది. స్పిరిట్ సినిమాలో ముగ్గురు భామలు నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మడోన్నా సెబాస్టియన్ ఇన్ స్టా..
వామిక గబ్బి ఇన్ స్టా గ్రామ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి