
ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ మన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటున్నాయి. అయితే చాలామంది సైబర్ నేరస్తుల బారినపడి తమ డబ్బులు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పోగొట్టుకున్న ఈ డబ్బును తిరిగి బాధితులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. కొన్ని సందర్భాల్లో లక్షల రూపాయలు సైతం పోగొట్టుకున్న బాధితులకు వాటిని తిరిగి అప్పజెప్పిన దాఖలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ప్రతిరోజు సుమారు సగటున 20కి పైగా సైబర్ కేసులు నమోదు అవుతున్నాయి. సైబర్ క్రైమ్ చూసే పోలీసుల సంఖ్య కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో కేసుల ఫాలోఅప్ లేక బాధితులకు అందాల్సిన డబ్బు చేరటం లేదు. ఇందులో భాగంగా హైదరాబాద్ పోలీసులు ప్రతి జోన్ కు ఒక సైబర్ సెల్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఏడు జోన్లు ఉన్నాయి. ప్రతి జోన్ కు ఒక్కో సైబర్ సెల్ ను ఏర్పాటు చేశారు. ఒకవేళ మీరు సైబర్ నేరాల బారిన పడి పోగొట్టుకున్న డబ్బు 25 వేల రూపాయల లోపు ఉంటే ఈ సైబర్ సెల్ పోలీసులు ఆ డబ్బును మీకు అందించే మార్గంలో సహాయపడతారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి మీరు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత దానిని సైబర్ సెల్ పోలీసులు ఫాలో అప్ చేసి నిందితుల నుండి డబ్బులు రికవరీ చేసి, కోర్టు నుండి ప్రాసెస్ స్పీడ్ అప్ అయ్యేలాగా సైబర్ సెల్ పోలీసులు సహాయపడనున్నారు. ఒకవేళ మీరు పోగొట్టుకున్న డబ్బు 25 వేల రూపాయల పైబడే ఉంటే నేరుగా సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. 1930 నెంబర్ కు ఎలాంటి సైబర్ క్రైమ్ జరిగినా ఫిర్యాదు చేయవచ్చు. ఈ పోర్టల్ కు వచ్చే ఫిర్యాదులపై ప్రతి రోజు సైబర్ సెల్ పోలీసులు అర్హత కలిగిన కేసులపై ఫాలో అప్ చేస్తారు. మీ డబ్బు తక్కువ మొత్తంలో పొయి ఉంటే ఆ డబ్బును హోల్డ్ చేసి ఉంటే కనుక సైబర్ సెల్ పోలీసులు వాటిని తిరిగి మీకు అప్పజెబుతారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మో.. చేప కొరికితే ఇంత డేంజరా? ఏకంగా చెయ్యే తీసేశారు
వివాహ వేడుకకు విశిష్ట అతిథి.. బంధుమిత్రులంతా పరుగో పరుగు
సర్పంచ్ కుర్చీని వదలనంటున్న శునకం.. చూసేందుకు క్యూ కడుతున్న జనం
షాపులో వింత శబ్ధాలు.. ఏంటా అని చూసిన ఓనర్కి షాకింగ్ సీన్
నేర చరిత్ర ఉన్న రిసార్ట్లో బస? హనీమూన్ కోసం వెళ్లి.. అడవుల్లో అదృశ్యం