. < 1 minute
Manchu Vishnu Says Kannappa Budget More Than Raja Saab

Kannappa : కన్నప్ప బడ్జెట్ గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఇంత అయిందంట.. అంత అయిందంట అంటూ రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చివరకు మంచు విష్ణు దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. అసలు ఎంత బడ్జెట్ అయిందో వివరించాడు. జూన్ 27న మూవీ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో మాట్లాడుతూ.. ‘కన్నప్ప బడ్జెట్ చాలా ఎక్కువే అయింది. మూవీని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు మేం వెనకడుగు వేయలేదు.

Read Also : Shajan Padamsee : పెళ్లిపీటలెక్కిన రామ్ చరణ్‌ హీరోయిన్..

ఈ ఏడాది రాబోతున్న రాజాసాబ్, ఓజీ సినిమాల కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కేవ. కన్నప్పకు త్రిబుల్ ఫిగర్ బడ్జెట్ అయింది. దాని బడ్జెట్ ఎంతో చెబితే ఐటీవాళ్లు నా ఇంటి ముందు క్యూ కడుతారు. అందుకే కరెక్ట్ గా చెప్పట్లేదు. కన్నప్ప మూవీ నా డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే దానికోసం అంత డబ్బులు పెట్టాం. సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. మేం ఎంత డబ్బు పెట్టామనేది మీ ఊహకే వదిలేస్తున్నాం’ అంటూ తెలిపాడు.

ఆయన చేసిన కామెంట్స్ పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. మంచు విష్ణుకు ఇలాంటి కామెంట్స్ అలవాటే అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా ప్రమోషన్ కోసమే అంటూ ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. మరి కన్నప్ప బడ్జెట్ నిజంగానే వందల కోట్లు దాటేసిందా లేదా అనేది మూవీ రిలీజ్ అయితేనే తేలిపోతుంది.

Read Also : Deepika Padukone : కల్కి సీక్వెల్.. దీపిక అవే కండీషన్లు..!

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.