
గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ నటీ నటులుగా యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్ పై యం.యన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “బ్యాచిలర్స్ ప్రేమ కథలు”. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరుగగా ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శక, నిర్మాత, సాగర్ మాట్లాడుతూ.. ఇంతకుముందు నేను తీసిన “కాలం రాసిన కథలు” సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ ఉత్సాహంతో దానికి సీక్వెల్ గా “బ్యాచిలర్స్ ప్రేమ కథలు సినిమా తీస్తున్నాను” ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి షోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను.అలాగే ఇందులో కూడా నూతన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను.ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసుకుంటున్న ఈ సినిమాను త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని 2025 లోనే విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇక నటి గీతా సింగ్ మాట్లాడుతూ..అడియన్స్ అందరూ నా పాత్రకు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమాలో ఎమోషనల్ పాత్ర చేయబోతున్నాను. ఈ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నానని అన్నారు. చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాత సాగర్ గారికి నా ధన్యవాదాలు అన్నారు.