అక్కినేని అందగాడు అఖిల్ తన ప్రియురాలు జైనబ్ రవ్జీను 2025 జూన్ 6న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో నాగార్జున నివాసంలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది, ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్లో రిసెప్షన్ జరగనుంది. అఖిల్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జైనబ్ రవ్జీ దిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ, నాగార్జున కుటుంబంతో స్నేహబంధం కలిగి ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త. అఖిల్, జైనబ్ రెండేళ్ల క్రితం పరిచయం నుంచి ప్రేమలో పడ్డారు.
ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది (నవంబర్ 26, 2024). అఖిల్ వివాహంతో అక్కినేని అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. తాజాగా కింగ్ నాగార్జున అఖిల్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు తతెగ వైరల్ అవుతున్నాయి.
అఖిల్ వివాహంకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారలు వీరి వివాహనికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్ లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్న ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి.