
Muhammad Yunus: బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ వచ్చే ఏడాది ఏప్రిల్లో దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ ప్రకటించారు. అక్కడి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గత సంవత్సరం బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుండి షేక్ హసినా తొలగించబడిన అనంతరం దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత నెలకొంది. అప్పటి నుండి ఆమె పరారీలో ఉన్నారు. ఈ పరిణామాల మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు పునాది వేయడమే యూనస్ లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2026లో ఎన్నికలు జరుగబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Covid-19 Variant: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్.. లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?
ఈ సందర్భంగా ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన పూర్తి రోడ్ మ్యాప్ ను ఎన్నికల కమిషన్ తగిన సమయంలో ప్రజలకు అందిస్తుందని తెలిపారు. షేక్ హసినా అధికారంలో ఉన్న సమయంలో నిర్బంధాలు, విపక్షాలపై వేధింపులు పెరిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ పరిస్థితిలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన ముహమ్మద్ యూనస్ ప్రస్తుతం తాత్కాలిక పాలకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Read Also: Preity Zinta: ఆశించినట్టు ముగియలేదు.. ఫైనల్ పరాజయంపై స్పందించిన ప్రీతీ జింటా..!