. < 1 minute
Muhammad Yunus Announces Bangladesh General Elections Amid Political Unrest

Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ ప్రకటించారు. అక్కడి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గత సంవత్సరం బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుండి షేక్ హసినా తొలగించబడిన అనంతరం దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత నెలకొంది. అప్పటి నుండి ఆమె పరారీలో ఉన్నారు. ఈ పరిణామాల మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు పునాది వేయడమే యూనస్ లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2026లో ఎన్నికలు జరుగబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: Covid-19 Variant: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్‌ వేరియంట్‌.. లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?

ఈ సందర్భంగా ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన పూర్తి రోడ్‌ మ్యాప్‌ ను ఎన్నికల కమిషన్ తగిన సమయంలో ప్రజలకు అందిస్తుందని తెలిపారు. షేక్ హసినా అధికారంలో ఉన్న సమయంలో నిర్బంధాలు, విపక్షాలపై వేధింపులు పెరిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ పరిస్థితిలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన ముహమ్మద్ యూనస్ ప్రస్తుతం తాత్కాలిక పాలకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Read Also: Preity Zinta: ఆశించినట్టు ముగియలేదు.. ఫైనల్ పరాజయంపై స్పందించిన ప్రీతీ జింటా..!

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.