
జన్నారం, వెలుగు: ప్రొటోకాల్ పాటించలేదని మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ లోని జన్నారం ఇన్ చార్జ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శేషారాం నాయక్ను సస్పెండ్ చేశారు. కవ్వాల్ టైగర్ జోన్లో పర్యాటక కేంద్రాలను గుర్తించి వాటి అభివృద్ధి, ఇతర అంశాలను పరిశీలించేందుకు స్టేట్ వైల్డ్ లైఫ్, విజిలెన్స్ పీసీసీఎఫ్ ఈలుసింగ్ మేరు ఈ నెల 2న జన్నారం వచ్చారు.
అయితే ఆయనకు సరైన వసతి కల్పించలేదని, ప్రొటోకాల్ పాటించడంతో నిర్లక్ష్యం వహించారని శేషారాంను సస్పెండ్ చేస్తూ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే వ్యవహరంలో జన్నారం ఇన్చార్జి ఎఫ్డీవో శివ్ అశిష్సింగ్, తాళ్లపేట రేంజ్ ఆఫీసర్ సుస్మారావులకు మెమో జారీ చేశారు. జన్నారం రేంజ్ పరిధిలో నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఫారెస్ట్ ఆఫీసర్లు సస్పెన్షన్కు గురవడం చర్చనీయాంశమైంది.