. < 1 minute

BRS government gave permission ethanol company

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్‌రావు శవరాజకీయాలు చేస్తున్నారని ఎఐసిసి సంపత్‌ కుమార్ తెలిపారు. బిఆర్ఎస్ రాజకీయ కుట్రలో భాగంగానే ధన్వాడ ఘటన జరిగిందని, రైతులపై బిఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారని మండిపడ్డారు.
ఇథనాల్ కంపెనీకి అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుమతులు ఇచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అనుమతి ఇవ్వలేదని సంపత్‌ కుమార్ తెలియజేశారు. రైతుల భూములను ప్రభుత్వం లాక్కోలేదని స్పష్టం చేశారు. ప్రజల జీవితాలతో హరీష్‌రావు రాజకీయం చేయొద్దని సూచించారు. జోగులాం బ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలో పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యా క్టరీ నిర్మాణంపై 12 గ్రామాల ప్రజలు దాడి చేసిన విషయం తెలిసిందే.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.