
హ్యుందాయ్ కొత్త ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ రిలీజ్ చేయడం ద్వారా వెర్నా సెడాన్ శ్రేణిని విస్తరించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ ధర రూ. 13.79 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు 115 హెచ్పీ, 144 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ పెట్రోల్ మోటారుతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో ఎంటీ, ఐవీటీ రెండూ ఉన్నాయి. ఐవీటీ వెర్షన్ ధర రూ. 15.04 లక్షల వరకు ఉంటుంది.
వెర్నా ఎస్ఎక్స్+ కారులో వెంటిలేటెడ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, లెథరెట్ అలరీ, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఎక్స్టీరియర్ విషయానికి వస్తే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్లు ఆకట్టుకుంటున్నాయి. ఎస్ఎక్స్ ప్లస్ ట్రిమ్ ఇంటీరియర్లో 8.0-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి లక్షణాలు ఆకట్టుకుంటాయి. ఈ సిస్టమ్ వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ చేస్తుంది. మైలేజ్ విషయానికి మాన్యువల్ వేరియంట్ 18.6 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. అయితే ఐవీటీ వేరియంట్ 19.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
కొత్త వెర్నా వేరియంట్తో పాటు హ్యుందాయ్ వైర్డ్-టు-వైర్లెస్ అడాప్టర్ అనే కొత్త యాక్సెసరీని కూడా విడుదల చేసింది. ఈ అడాప్టర్ ధర రూ. 4,500. అలాగే వెర్నా, గ్రాండ్ ఐ10 నియోస్, ఎకర్, ఆరా, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్, అల్కాజార్ వంటి అనేక మోడళ్లకు వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ప్లేను అనుమతిస్తుంది. అలాగే మే 2025లో మొత్తం 58,701 హ్యూందాయ్ యూనిట్ల అమ్మకాలు నమోదయ్యయాని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్ 43,861 యూనిట్లు అమ్ముడైతే విదేశీ మార్కెట్లకు 14,840 యూనిట్లు రవాణా చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి