. < 1 minute
Canadas Pm Mark Carney Dials Modi For G7 Summit Invite

G7 Summit: కెనడాలోని అల్బెర్టాలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న జీ7 సమ్మిట్ కు భారతదేశానికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కెనడా ప్రధాని మార్క్‌ కార్నే ఫోన్‌ చేసి సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ విషయాన్ని మోడీ అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. కార్నేతో ఫోన్‌లో మాట్లాడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన అతడ్ని అభినందించినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు.

Read Also: Covid-19 Variant: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్‌ వేరియంట్‌.. లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?

అయితే, భారత్‌- కెనడా శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మార్క్‌ కార్నేతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. 51వ జీ-7 సదస్సుకు కెనడా ఆతిథ్యం ఇస్తుంది. జీ7 దేశాల్లో భారత్‌ లేన్నప్పటికీ.. నిర్వహణ దేశాల ఆహ్వానం మేరకు మన ప్రధాని మోడీ ఆ శిఖరాగ్ర సదస్సుల్లో పలుమార్లు పాల్గొన్నారు. గతేడాది ఇటలీ వేదికగా జరిగిన సదస్సుకు భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో పాటు పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కూడా పాల్గొని తన గళాన్ని గట్టిగా వినిపించారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.