. < 1 minute

Schools will start from June 12

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ లోపే అన్ని పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 1.40 కోట్ల పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటివరకు 1.34 కోట్ల పుస్తకాలు పాఠశాలలకు చేరినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పుస్తకాలు కూడా త్వరలోనే పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల సాధ్యమైనంత వేగంగా వాటిని పాఠశాలలకు తరలించాలని కార్యాచరణ రూపొందించారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు కొత్త పాఠ్యపుస్తకాలను తీసుకెళ్తున్నారు. పుస్తకాలు పాఠశాలలకు చేరిన తర్వాత స్కూల్లో తరగతుల వారీగా వేర్వేరు గదుల్లో ఉంచుతున్నారు. వర్షాల నేపథ్యంలో పుస్తకాలు తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.