అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో కూర్చొని భోజనం చేయడం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయంట. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, అసలు ఏ దిశలో కూర్చొని భోజనం చేయడం వలన ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.
అయితే మనం రోజు చేసే పనుల్లో ఆహారం తినడం అనేది కామన్. చాలా మంది దీని గురించి అంతగా పట్టించుకోరు. వారికి నచ్చిన దిశలో, వారికి నచ్చినట్లుగా కూర్చొని భోజనం చేస్తుంటారు. ఇంకొందరైతే ఏకంగా బెడ్ రూమ్లోనే భోజనం చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
భోజనం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా, సరైన దిశలో సరైన స్థానాన్ని చూసుకొని, కూర్చొని భోజనం చేయాలంట. ఇలా చేయడం వలన మానసికంగా ప్రశాంతత కలుగుతుందంట. అంతే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో కూర్చొని భోజనం చేసే వారి ఇంట సంపద కూడా పెరుగుతుందంట.
వాస్తు ప్రకారం తూర్పు దిశలో కూర్చొని భోజనం చేయడం చాలా మంచిదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. తూర్పు దిశలో కూర్చొని భోజనం చేయడం వలన ఆ వ్యక్తి జీర్ణ వ్యవస్థ సజావుగా సాగడమే కాకుండా ఆ ఇంట్లో సంపద పెరుగుతదందంట. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా తూర్పు దిశలోనే కూర్చొని భోజనం చేయాలంట.
పశ్చిమ దిశలో కూర్చొని భోజనం చేసినా మంచి ఫలితాలే కలుగుతాయంట. కానీ కొంత మంది తెలిసి, తెలియక దక్షణ దిశలో కూర్చొని భోజనం చేస్తారు ఇది అస్సలే మంచిది కాదంట. దీని వలన చాలా సమస్యలు వస్తాయంట.