
Siraj : ఉగ్రకదలికలపై తీవ్ర దృష్టిసారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), హైదరాబాద్లో కీలకంగా మకాం వేసిన సిరాజ్ అనే వ్యక్తి చుట్టూ దర్యాప్తును ముమ్మరం చేసింది. గత ఏడు సంవత్సరాలుగా గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో హైదరాబాద్లో తిష్ట వేసిన సిరాజ్, పక్కా వ్యూహంతో కార్యకలాపాలను సాగించినట్లు అధికారులు గుర్తించారు. సిరాజ్తో కలిసి ఉన్న సమీర్ అనే వ్యక్తి – హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం నవంబరు 22న ముంబయి అంధేరిలో జరిగిన ఓ మత కార్యక్రమానికి సిరాజ్, సమీర్ హాజరైనట్లు విచారణలో వెల్లడైంది. అందులో అధాన్ ఖురేషి, దిల్హాన్, మొహిసిన్ షేక్, జసీర్ అలియాస్ అమన్, ఫహాద్, అమిర్ అన్సారీ వంటి వ్యక్తులెందరికీ సంబంధించిన సంబంధాలు కూడా వెలుగుచూశాయి.
BJP: కర్ణాటకలో కాంగ్రెస్ ఖతం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారం..
ఒమన్, సౌదీ దేశాల నుంచి సిరాజ్, సమీర్లకు ఆర్థిక సాయం అందినట్లు గుర్తించిన అధికారులు, ఆ ఛానెళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే యూపీకి చెందిన బాదర్ అనే వ్యక్తి, ఫర్హాన్ మోయినుద్దీన్ అనే వరంగల్ యువకునితో సిరాజ్ సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. బాదర్తో సిగ్నల్ యాప్ ద్వారా కాంటాక్ట్లో ఉండటం, ఫర్హాన్ కోసం ప్రత్యేకంగా నాలుగు బృందాల గాలింపు చర్యలు కొనసాగించడం ప్రస్తుతం దర్యాప్తులో కీలకాంశంగా మారింది. సిరాజ్ స్థాపించిన సంస్థలో సభ్యత్వం కలిగి ఉన్న ఇతరులను కూడా గుర్తించే ప్రయత్నంలో ఉన్న ఎన్ఐఏ, దేశీయంగా మరియు అంతర్జాతీయంగా ఉగ్రవాద అనుకూల స్వభావమున్న యువకులతో సంబంధాలను విపులంగా పరిశీలిస్తోంది. సిరాజ్, సమీర్ల ప్లాన్ ఏమిటన్నదానిపై క్లారిటీ కోసం అధికారులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ విచారణతో పాటు, ఇతర అనుమానాస్పద చర్యలను పసిగట్టి ముందస్తు చర్యలు తీసుకునే దిశగా భద్రతా సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.
Lion Attack: సింహానికి టచ్ ఇచ్చాడు.. వెంటనే స్ట్రెచర్ ఎక్కాడు..!